కుక్కలు ఉంచే గదిలో అద్దెకు నివసిస్తున్న వలస కార్మికుడు

52చూసినవారు
కుక్కలు ఉంచే గదిలో అద్దెకు నివసిస్తున్న వలస కార్మికుడు
పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్యామ్ సుందర్ నాలుగేళ్ల కిందట కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు వచ్చాడు. వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే గత మూడు నెలలుగా పిరవోమ్‌లోని ఒక ఇంటి ఆవరణలో ఉన్న పాత డాగ్‌ కెన్నెల్‌లో అతడు నివసిస్తున్నాడు. ఆ ఇరుకైన కుక్కల గదికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.