పశ్చిమ బెంగాల్కు చెందిన శ్యామ్ సుందర్ నాలుగేళ్ల కిందట కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు వచ్చాడు. వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే గత మూడు నెలలుగా పిరవోమ్లోని ఒక ఇంటి ఆవరణలో ఉన్న పాత డాగ్ కెన్నెల్లో అతడు నివసిస్తున్నాడు. ఆ ఇరుకైన కుక్కల గదికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.