పట్టాలపై రీల్స్ చేస్తుండగా రైలు రావడంతో మూడేళ్ల బాలుడితో సహా తల్లిదండ్రులు మృతి

74చూసినవారు
పట్టాలపై రీల్స్ చేస్తుండగా రైలు రావడంతో మూడేళ్ల బాలుడితో సహా తల్లిదండ్రులు మృతి
ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన జరిగింది. పట్టాలపై రీల్స్ చేస్తుండగా రైలు దూసుకురావడంతో మూడేళ్ల బాలుడితో సహా తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. సీతాపూర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (26) తన భార్య, మూడేళ్ల బాలుడితో కలిసి రైలు పట్టాలపై రీల్స్‌ చేస్తున్నాడు. ఇంతలో రైలు వేగంగా వారి పైకి దూసుకురావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఉమరియా గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్