అడ శిశువుని బ్రతికుండగానే మట్టిలో పాతిపెట్టారు.. చివరికి..

88292చూసినవారు
హన్మకొండ జిల్లాలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు ప్రాణాలతో పాతిపెట్టారు. దామెర (M) ఊరుగొండ శివారులో రోడ్డుపక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్, భూమిలో కదలికలు గుర్తించి మట్టి తీసి చూడగా పసికందు కనిపించింది. పక్కనే ఉన్న కూలీలను పిలిచి పాపను మట్టిలోనుండి బయటకు తీశారు. అక్కడకు చేరుకున్న ఎస్సై, పసికందును ఎంజీఎంకు తరలించారు. అర్థగంటకు పైగా మట్టిలో పాతిపెట్టిన పాప ప్రాణాలతో ఉండడంతో అందరూ అవాక్కయ్యారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
Job Suitcase

Jobs near you