ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రమాయి నగర్ కు చెందిన విజయ్ కుమార్తె శిరీషకు అపెండిక్స్ ఆపరేషన్ ఉండటంతో అత్యవసరంగా రక్తం అవసరముండటంతో సామాజిక కార్యకర్త మెస్రం సోను సహకారంతో భీంపూర్ మండలానికి చెందిన పెందూర్ జ్ఞ్యానేశ్వర్ రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రక్తదానం చేసి ఆదుకున్నారు. రక్త దానం చేసి ఆదుకోవడం పట్ల శిరీష తండ్రీ కృతజ్ఞతలు తెలిపారు. వారితో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.