డీఎడ్ లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. రవిందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఆసక్తి గల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 30 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష జులై 10న ఆన్లైన్ లో ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం htpp: //deecet. cdse. telangana. gov. in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.