బిఆర్ఎస్ తోనే అభివృద్ధి
బిఆర్ఎస్ తోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు అజయ్ ఆన్నారు. పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు. నేతలు భూమాన్న, రామ్ కుమార్, ఉదయ్, స్వరూప, భారత్, త్రిశూల, ఉన్నారు