ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం తిరుపతికి వెళ్లిన ఎమ్మెల్యే శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదిలాబాద్ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, నరేంద్రమోడీ మళ్ళీ ప్రధాని కావాలని ఆ శ్రీవారిని ప్రార్థించానాని ఎమ్మెల్యే తెలిపారు.