రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎంపీ

50చూసినవారు
తాంసి మండల కేంద్రంలో నూతన రోడ్ల నిర్మాణం పనులకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మంగళవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ రోడ్ల నిర్మాణం కోసం ఎంజి ఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుంచి మూడు లక్షలు కేటాయించామని అన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ , బిజెపి నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్