టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులైందని.. ఆ పాలనపై తానిప్పుడే విమర్శలు చేయబోనని అన్నారు. ఇదే సమయంలో రూ.4 వేలు పెన్షన్ ఇవ్వటం మంచిదేనని ప్రశంసించారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసే శక్తి వారికి రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక పార్టీ ఓటమిపై స్పందించిన బొత్స.. ప్రజలను తమను అంగీకరించలేదు కాబట్టే తాము ఓడిపోయామన్నారు.