నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రానున్న నాలుగో సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. నేడు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ‘ద మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్’ అంటూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. కాగా ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.