జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మరో కేసు నమోదైంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా, వీటిని దర్యాప్తును చేస్తున్న కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రజ్వల్పై నాల్గవ కేసు నమోదు చేసింది. ఇప్పుడు కొత్త కేసులో బాధితుల ఫొటోలను రహస్యంగా రికార్డ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం వంటి సెక్షన్ల కింద నమోదు చేశారు.