కేజ్రీవాల్‌ అరెస్టు: ఈడీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

551చూసినవారు
కేజ్రీవాల్‌ అరెస్టు: ఈడీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కేసు విచారణలో భాగంగా ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తొలిసారి షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఈ మేరకు సుప్రీం కోర్టు మే 3 కి వాయిదా వేసి.. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను ఆదేశించింది.