అస్సాంలోని గౌహతిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బసిస్తా స్టేషన్కు చెందిన పోలీసు అధికారిపై ECHO అనే స్థానిక బార్లో దాడి జరిగింది. సోదాల నిమిత్తం వెళ్లిన ప్రదీప్ బాసుమతరీ అనే పోలీసును కొందరు కొట్టారు. ఆయనపై దుండగులు డీజిల్ పోసి నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. దీనిని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. బార్ యజమాని సహా నటీమణులు కొరోబి శర్మ, మయూరి గౌతమ్లను అరెస్ట్ చేశారు.