రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం
![రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం](https://media.getlokalapp.com/cache/2b/cc/2bcc3f392bef1dca5822426f31c4bcf4.webp)
నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించడంతో రాజ్భవన్ ముట్టడికి నేతలు బయలు దేరారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీపుల్స్ ప్లాజా నుంచి రాజభవన్ వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్కు తరలించారు.