కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
![కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు](https://media.getlokalapp.com/cache/00/5e/005e36494dbf5f22b97893c5f2656294.webp)
విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్నే కేసీఆర్ తప్పుపడతారా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘విచారణ కమిటీ ఛైర్మన్ వైదొలగాలని బెదిరించడం ముమ్మాటికీ ధిక్కరణే. కమిషన్ ఏర్పాటే తప్పయితే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? అక్రమాలకు పాల్పడకపోతే విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వాస్తవాలెందుకు వివరించడం లేదు' అని ఓప్రకటనలో తెలిపారు.