వ్యాక్సిన్ల తయారీ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా 2025 సంవత్సరానికి గానూ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అందించే ప్రతిష్టాత్మక ఇండియా ఫెలోషిప్కు ఎంపిక అయ్యారు. కొత్త ఆవిష్కరణలు, విజ్ఞానం, వ్యాక్సిన్ అభివృద్ధి, తదితర అంశాల్లో ఆయన చేసిన కృషికి ఈ ఫెలోషిప్ వరించింది. ఇప్పటికే ఈ ఫెలోషిప్ల జాబితాలో అనిల్ కకోద్కర్, వికె సరస్వత్, సోమనాథ్ ఉండటం విశేషం.