మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీవీ నరసింహారావు తెలంగాణకు చెందిన వ్యక్తి. పీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పని చేశారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ తో పాటు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాధన్ కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించింది.