పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జట్టు సభ్యులందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 5 పాయింట్లను తగ్గించింది. న్యూలాండ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్కి ఐసీసీ ఈ జరిమానా విధించింది. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి పాకిస్థాన్ జట్టు ఐదు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది.