మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ దుస్తుల దుకాణంలో రెండు ఎద్దులు కొట్లాడుకున్నాయి. జబల్పూర్లోని పండరీబా మార్కెట్లో ఎద్దులు పోట్లాడుకున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా షాపులోకి దూసుకెళ్లి లక్షల రూపాయల విలువైన వస్తువులను ధ్వంసం చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షాపు యజమాని, సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.