9 నెలలు తర్వాత సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి చేరుకోవడం వల్ల భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. గుజరాత్లోని ఝూలాసన్లో సునీతా విలియమ్స్కు చెందిన ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు, బాణా సంచా కాల్చుతూ డ్యాన్సలు చేశారు. అంతకుముందు ఆమె సురక్షితంగా రావాలని ఆ గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి యజ్ఞం చేశారు.