తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తుందని రేవంత్ అనడం దారుణం అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమక్షంలో మాట్లాడారు. ఏపీ ప్రజలను, రైతులను దోపిడీ దొంగలుగా చిత్రీకరించడం దారుణం అని.. ఒక సీఎంగా ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం ఎవరి త్యాగాలతో నిర్మించారో రేవంత్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు.