కేదార్నాథ్ మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఆ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుగురికి చేరుకున్నది. ఇవాళ ఉదయం మరో నలుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది యాత్రికులు ఉంటారని రుద్రప్రయాగ్ పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ శాతం మధ్యప్రదేశ్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం పట్ల సీఎం పుష్కర్ సింగ్ థామీ సంతాపం వ్యక్తం చేశారు.