తెలంగాణలోని విద్యార్థులకు మంత్రి భట్టి విక్రమార్క తీపికబురు అందించారు. విద్యార్థుల కడుపు మార్చుకుండా ఉండడానికి ఉచితంగా సాయంత్రం వేళ స్నాక్స్ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక సంక్షేమ వసతి గృహాల్లో ‘కామన్ డైట్’ స్కీం అమలు చేయబోతున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. గురుకులాల్లో డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచబోతున్నామని అన్నారు.