'కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైంది'

74చూసినవారు
'కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైంది'
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరవు లేదన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైందని విమర్శించారు. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయి.. కొత్తగా బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయన్నారు.