సీపీఎం సీనియర్ నేత ఎంఎం లారెన్స్ కన్నుమూత

61చూసినవారు
సీపీఎం సీనియర్ నేత ఎంఎం లారెన్స్ కన్నుమూత
కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సిపిఐ (ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎం లారెన్స్ (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో సుమారు నెల రోజులుగా ఆయన చికిత్స పొందుతూ శనివారం ఉదయం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సీపీఐఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడిగా, ఎర్నాకులం జిల్లా కార్యదర్శిగా, లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్‌గా, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్