పార్కింగ్ విషయంలో చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యాన్ని చూపుతుంటారు. దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇదే కోవలో ఒడిశాలోని కటక్ శ్రీమా హాస్పిటల్ స్క్వేర్ వద్ద ఆదివారం ఊహించని ప్రమాదం జరిగింది. నాన్ పార్కింగ్ ఏరియాలో, రోడ్డుపై ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేశాడు. ఓ బైక్ వేగంగా వచ్చి ఆ కారును ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు ఎగిరి కింద పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.