వర్షాలతో వాతావరణంలో కలిగే మార్పులు మనుషులతోపాటు జీవాలకు హాని కలిగిస్తాయి. జీవాలకు చిటుక రోగం, గాలికుంటు, నీలినాలుక, పిపిఆర్ వంటి రోగాలు వచ్చి జీవాలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో జీవాల పెంపకం దారులు నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్ధికంగా ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి వ్యాధులను గుర్తించిన వెంటనే పశువైద్యాధికారిని కలిసి తగిన చికిత్స జీవాలకు అందించడం ఉత్తమం.