బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్, కొండలు, గుట్టలకు రైతుబంధు ఇచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 68 లక్షల మంది రైతులకు రూ.7625 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసితీరుతామని అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న ఛాలెంజ్కు హరీష్ రావు కట్టుబడి ఉండాలని అన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ మండిపడ్డారు.