చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ, టీ తాగితే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, కడుపు మంట వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. మూత్రపిండాలపై ఒత్తిడి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి కీళ్ల నొప్పులు వస్తాయి. దీనికి బదులుగా కొబ్బరి నీరు, మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు.