గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలో సముద్రతీరాన నిషేధిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సరకు విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.16 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసుల బృందం (ఎస్వోజీ) రెండు రోజుల క్రితం సముద్ర తీరం వెంబడి గస్తీ తిరుగుతుండగా మూడు ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. అందులో 30 ప్యాకెట్లలో 32 కేజీల చరాస్ ఉంది.