గుజరాత్లోని భావనగర్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.1గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆ ప్రాంతంలో రాత్రి 9.52 గంటలకు భూమి కంపించినట్లు తెలిపింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.