ఈ నెలలో ఎలాన్ మస్క్ భారత్కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ప్రధాని మోదీతోనూ భేటీ కానున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా దేశంలో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ పర్యటనపై అటు ప్రధాని కార్యాలయం గానీ, టెస్లా గానీ అధికారికంగా స్పందించలేదు.