పంజాబ్లో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. 2021 ఏప్రిల్లో అమరిందర్ సింగ్ ప్రభుత్వం ఆ స్కీమ్ను ప్రారంభించింది. ఆ స్కీమ్ వల్ల పంజాబీ మహిళలు కొంత లాభపడ్డారు. కానీ పీఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నది. మరో వైపు ఆ సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 250 కోట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో.. పీఆర్టీసీ తమ ఉద్యోగులకు జీతాలు, పెన్షలు ఇవ్వలేకపోతున్నది.