గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్స్) ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. ఐఐటీ రూర్కీ ఇవాళ సాయంత్రం అభ్యర్థుల స్కోర్ విడుదల చేయనుంది. ఎంటెక్లో, కొన్ని విద్యాసంస్థల్లో నేరుగా పీహెచ్డీలో ప్రవేశానికి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ)లో కొలువులకు అర్హత పొందేందుకు నిర్వహించే ఈ పరీక్షలకు 6.53 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 1.29 లక్షల మంది అర్హత సాధించారు.