AP: రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖకు తొందర్లోనే కొత్త బిల్డింగుల నిర్మించి ఇస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.