తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్లో రాష్ట్ర ఆదాయ మార్గాల అంచనాను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ నుంచి లిక్కర్ అమ్మకాల ద్వారా ఆదాయం అంచనా రూ.27,623 కోట్లుగా సర్కార్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర పన్నుల రాబడి అంచనా రూ.1,45,419 కోట్లుగా స్పష్టం చేసింది. కాగా ఇదే ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూర్చనున్నట్లు భట్టి వెల్లడించారు.