
వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
AP: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.