ఓ వివాహ వేడుకకు హాజరైన వధూవరుల బంధువులు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన యూపీలోని సంభాల్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి హీనా ప్యాలెస్లో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి చూసేందుకు వచ్చిన అతిథుల మధ్య ఓ పోటీ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో అక్కడ ఉన్న కుర్చీలు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరకు పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమనిగింది.