దేశంలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఆయా పార్టీ అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. మద్దతుదారులతో భారీ బహిరంగ సభలు, రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు జేబుదొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. టీవీ రాముడిగా పేరొందిన మీరట్ బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ పాల్గొన్న రోడ్షోలో అనేక చోరీలు చోటుచేసుకున్నాయి. జనాల్లో కలిసిపోయిన దొంగల ముఠా పలువురి నుంచి డబ్బు, నగలు, ఫోన్లు కాజేశారు.