హైదరాబాద్ నగరంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 3,982.25 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని కోల్కతా నుంచి బస్సులో హైదరాబాద్కు తీసుకువస్తున్నట్లు గుర్తించారు.