తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా నగరం అతలాకుతలం అయింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులు నదులను తలపించాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా సంభవించిన వరదలకు పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.