కొంత మంది చేసే వినూత్న ఆలోచనలు కొన్ని సందర్భాలలో ప్రశంసలు పొందితే.. మరికొన్ని సమయాల్లో అబాసుపాలు చేస్తాయి. ఈ మేరకు ఓ ఇద్దరు కుర్రాళ్లు ఓ ఏటీఎంకి వెళ్లారు. వారి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకున్నా ఏటీఎం కార్డును పదే పదే వాడి..బ్యాలెన్స్ స్లిప్పులు సంపాదించారు. తర్వాత వాటిని ఓ షాపులో అమ్మేశారు. దాంతో వారికి రూ.20 రావడంతో ఇద్దరూ టీ తాగారు. కప్పు టీ కోసం ఎంత పని చేశారు అంటూ నేటిజన్లు కామెడీ కామెంట్స్ చేస్తున్నారు.