ఇరాన్​ బొగ్గు గనిలో భారీ పేలుడు.. 30 మంది కార్మికులు మృతి

84చూసినవారు
ఇరాన్​ బొగ్గు గనిలో భారీ పేలుడు.. 30 మంది కార్మికులు మృతి
ఇరాన్​లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో 30 మంది కార్మికులు మరణించారు. ఇరాన్​ రాజధాని టెహ్రాన్ కు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కావడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమయంలో గనిలో 70 మంది పని చేస్తున్నట్ల సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్