బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసి ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈనెల 31వరకు ఈ-కేవైసి చేసుకునేందుకు అవకాశం ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్న వారు దగ్గరలోని ఎదైన రేషన్ సెంటర్ కి వెళ్లి ఆధార్ నెంబర్ చెప్పి వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 31 లోగా ఈ-కేవైసీ పూర్తీ చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని ఇప్పటికీ అధికారులు స్పష్టం చేశారు.