చాంద్రాయణగుట్ట డివిజన్ పరిధిలో శుక్రవారం ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంఐఎం అధ్వర్యంలో చేసిన అభివృద్ధిపై అవగాహన కల్పించారు. మరోసారి ఎంపీగా అవకాశం ఇస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. ప్రచారంలో ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.