అభివృద్ది పనులను వేగం పెంచాలని కార్వాన్ ఎమ్మేల్యే కౌసార్ మొహియుద్దీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ ను అయన కార్యాలయంలో కలిసి నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులను వీలైనంత తొందరగా పూర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు సైతం పాల్గొన్నారు.