హెపటైటిస్-బి, సి కేసుల విషయంలో భారత్.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక పేర్కొంది. 2022లో భారత్లో ఈ రుగ్మత బాధితులు 3.5 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. కాలేయంలో ఇన్ఫ్లమేషన్ తలెత్తడం వల్ల హైపటైటిస్ వస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి మరణానికి దారితీయవచ్చు.