తపాలా శాఖ అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలామంది వినే ఉంటారు. కానీ దీనిపై అవగాహన తక్కువే. ఇందులో రిస్క్ లేకుండా చిన్న మొత్తాల్లో పొదుపు చేసి అధిక లాభాలు పొందొచ్చు. దీని కాల వ్యవధి 15 ఏళ్లు కాగా ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు. ఇందులో రోజుకు రూ.417 చొప్పున నెలకు రూ.12,500.. 15 ఏళ్లు కడితే రూ.40లక్షల వరకు రాబడి అందుతుంది. అదే 25 ఏళ్లకు రూ.37లక్షల పెట్టుబడికి గాను రూ.కోటి పొందొచ్చు.