తమ అధీనంలో ఉన్న 25 మంది సెయిలర్లను విడుదల చేసినట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. వారిలో 17 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్తో వైరం కారణంగా ఆ దేశ వ్యాపారికి చెందిన పోర్చుగీసు నౌకను గతంలో ఇరాన్ అధీనంలోకి తీసుకుంది. అందులో భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో ఏకైక మహిళా క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ను గతంలోనే ఇరాన్ విడుదల చేసింది. తాజాగా మిగిలిన వారిని సైతం విడుదల చేసినట్లు పేర్కొంది.