టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ వ్యవహారంపై బీసీసీఐ సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలోనే తన సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 2024-25కు గానూ బీసీసీఐ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టును ప్రకటించనుంది. ఈ క్రమంలో గ్రేడ్-సీలో ఉన్నఇషాన్ సెంట్రల్ కాంట్రాక్టును పునరుద్ధరించే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. కాగా ఇషాన్ గ్రేడ్-సీ కింద ఏడాదికి రూ.కోటి వేతనం అందుకుంటున్నారు.